ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 1, గుంటూరులో 1 కేసు కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చారని బులిటెన్‌లో తెలిపారు.
CARONA-NEW

ఏపీని కరోనా మహమ్మారి భయపెడుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,858 శాంపిల్స్‌ను పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1958మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 59మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు కన్నుమూశారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.

కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,841కు చేరాయి. మరో 45 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 824కు చేరింది.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad