ఉగ్రరూపం దాల్చిన కరోనా.. 730 కొత్త కేసులు.. దారుణ స్థితిలో హైదరాబాద్


తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపు సంఖ్యలో పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజులోనే మళ్లీ ఆల్ టైం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 730 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7802కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 3861గా ఉన్నాయి. గత 24 గంటల్లో 225 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3731కు చేరింది. ఇక ఆదివారం మరో ఏడుగురు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 210కి చేరింది.

ఆదివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్త కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 659 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. జనగామలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. మేడ్చల్‌లో 9, వరంగల్‌లో 6, ఆసిఫాబాద్‌లో 3, వికారాబాద్‌లో 2, సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణ పేట, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులను గుర్తించారు.

ఇక ఆదివారం ఒక్కరోజులో 3297 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 730 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 57,054కు చేరింది. ఆదివారం 2,567 ఫలితాలు నెగటివ్‌గా తేలాయి.

కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad