AP లో కరోనా పంజా: మళ్లీ 500 కుపైగా కేసులు.. 24 గంటల్లో ఏడు మరణాలు



ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగడం టెన్షన్ పెడుతోంది. గత 24 గంటల్లో 19,085 శాంపిల్స్ పరీక్షించగా మరో 477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 69మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో 7గురికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 553కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 10884 చేరింది. గడచిన 24 గంటల్లో ఏడురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 136కి చేరింది. గత 24 గంటల్లో 118మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,988 నమోదయ్యింది. మరో 5,760మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 72, గుంటూరు జిల్లాలో 67, అనంతపురం జిల్లాలో 52, తూర్పుగోదావరి జిల్లాలో 64, కృష్ణా జిల్లాలో 47, చిత్తూరు జిల్లాలో 42 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 29, కడప జిల్లాలో 22, పశ్చిమగోదావరి జిల్లాలో 18, ప్రకాశం జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1555పాజిటివ్ కేసులు.. తర్వాత కృష్ణా జిల్లాలో 1179 కేసులు ఉన్నాయి.. అనంతపురం జిల్లాలో కేసులు 1080కు చేరాయి.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు

కర్నూలు జిల్లా -1555
కృష్ణా జిల్లా - 1179
అనంతపురం జిల్లా -1080
గుంటూరు జిల్లా - 958
తూర్పుగోదావరి జిల్లా - 824
పశ్చిమగోదావరి జిల్లా - 681
చిత్తూరు జిల్లా- 699
నెల్లూరు జిల్లా -522
కడప జిల్లా - 500
విశాఖపట్నం జిల్లా -407
ప్రకాశం జిల్లా - 218
విజయనగరం జిల్లా -99
శ్రీకాకుళం జిల్లా - 61
ఇతరులు- 76
మొత్తం కేసులు -10884
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad