భారత్ లో కరోనా కల్లోలం సృష్టింస్తోంది..3 లక్షలు దాటిన కేసులు



రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డ్ నెలకోల్పుతుండగా.. ఇవాళ పాసిటివ్ కేసుల సంఖ్య 3  లక్షలు దాటింది.. ఇప్పటి వరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,048  కు పెరిగింది. ఇక, మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 “కరోనా” కేసులు నమోదు కాగా.. తమిళనాడు లో 40,698  కేసులు.. ఢిల్లీలో 34,687 కేసులు నమోదు అయ్యాయి.

అయితే, కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రెట్టింపయ్యే వ్యవధి 17.4 రోజులకు పెరగడం మరో సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారం కిందట కేసులు రెట్టింపయ్యే వ్యవధి 15.4 రోజులుగా ఉందని చెబుతున్నారు అధికారులు. ఇక, కోవిడ్‌-19 రోగులు కోలుకునే రేటు 49.47 శాతానికి పెరిగిందని, ఇప్పటివరకూ 1,47,194 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 1,41,842 క్రియాశీలక కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 6,166 మంది రోగులు కోలుకున్నారని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad