HDFC బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్రెడిట్ కార్డ్ వాడే వారికి భారీ షాక్.

మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమరా? బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ తాజాగా క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికిి భారీ షాకిచ్చింది.

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. ఆలస్య రుసుము, వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుతానికి క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి షాక్ తగలనుంది.

కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు దీని దారిలో నడిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డులపై బ్యాంక్ ఇప్పటికే ఆలస్య రుసుము చార్జీలను రూ.150 నుంచి రూ.350 వరకు పెంచేసింది. సెప్టెంబర్ 1 నుంచే ఈ చార్జీలు అమలులోకి వచ్చాయి.

ఆగస్ట్ 31 వరకు చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.25,000 ఆపైన మొత్తాన్ని ఆలస్యంగా చెల్లిస్తే రూ.950 చార్జీని వసూలు చేసేది. అయితే సెప్టెంబర్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.25,000 నుంచి రూ.50,000 మధ్యలో క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ పెండింగ్‌లో ఆలస్య రుసుము కింద ఉంటే రూ.1,100 చార్జీని విధిస్తోంది. అదే రూ.50 వేలకు పైన బ్యాలెన్స్ చెల్లించకపోతే రూ.1,300 కట్టాల్సిందే.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్చి 31 వరకు ఆలస్య రుసుము కింద ఇంకా తక్కువ చార్జీనే వసూలు చేసేది. ఏప్రిల్ 1 నుంచి ఈ చార్జీలను రూ.750 నుంచి రూ.950కు పెంచేసింది. తర్వాత ఇప్పుడు చార్జీలను రూ.950 నుంచి రూ.1100కు పెంచేసింది. రూ.25,000కు పైన బ్యాలెన్స్ ఉన్న వారికి ఈ చార్జీలు వస్తాయి.

ఇక రూ.10,000కు లోపు మొత్తానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆలస్య రుసుము చార్జీలను బ్యాంక్ 16 నుంచి 20 శాతం మేర పెంచేసింది. ఇప్పుడు రూ.600 వరకు చార్జీలు వసూలు చేస్తోంది. అదే రూ.10 వేల నుంచి రూ.25 వేల మధ్యలో బ్యాలెన్స్ చెల్లించకపోతే అప్పుడు చార్జీలు రూ.800 వరకు పడతాయి. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై చెల్లించని మొత్తంపై వార్షిక వడ్డీ రేట్లను కూడా 41.88 శాతం నుంచి 43.2 శాతానికి పెంచేసింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad