డ్రాగన్ నిర్వాకం.. ప్రపంచం నెత్తిన మరో పిడుగు, 8న భూమికి ముప్పు.

 అదుపుతప్పిన చైనా రాకెట్

భూమి మీదకు దూసుకొస్తున్న రాకెట్

8వ తేదీన భూమిని ఢీకొడుతుందని అంచనా వేస్తున్న అమెరికా. 

Part of a huge rocket that launched China’s first module for its Tianhe space station is falling back to Earth and could make an uncontrolled re-entry at an unknown landing point

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారితో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ రోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. దీని నుంచి కోలుకోకముందే ప్రపంచం నెత్తిన డ్రాగన్ మరో బాంబు వేసింది. చైనా అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోంది. అది ఏ క్షణమైనా భూమిని తాకొచ్చని సైంటిస్టులు ఆందోళన పడుతున్నారు.

సాధారణంగా కూలిపోయిన రాకెట్లు సముద్రంలో పడుతుంటాయి. కానీ చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ మాత్రం భూమి వైపు దూసుకువస్తోందట. దీంతో అది ఎక్కడ పడుతుందో అర్ధంకాక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రక్షణ శాఖ ప్రస్తుతం 5బీ రాకెట్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న రాకెట్ భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందని పెంటగాన్‌ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు.

లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్‌ బరువు సుమారు 21 టన్నులు. ఇది ఏ క్షణానైనా భూమిపై పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించడం కోసం లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. అక్కడ నియంత్రణ కోల్పోయిన రాకెట్‌ శకలాలు భూమి మీదకు దూసుకొస్తున్నాయి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad