Pre Primary Primary schools పై విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

 ప్రిప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష:

అమరావతి:

ప్రిప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై గత సమావేశంలో నిర్ణయించిన విధంగా ప్రతిపాదనలు చేసిన పాఠశాల విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు.

మెదడు బాగా అభివృద్ధి చెందే 3 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి.

టీచర్లను సమర్థవంతంగా వినియోగించుకోడం, ప్రీప్రైమరీ, ప్రెమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన తదితర అంశాలే లక్ష్యాలుగా సరికొత్త ఆలోచనలు. 

దీంట్లో భాగంగానే ఫౌండేషనల్‌ స్కూళ్లు. ఇప్పటి మాదిరిగానే యథావిథిగా ఆ స్కూళ్లలో వైయస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు.

అధికారుల ప్రతిపాదనలు:

1). పీపీ–1, పీపీ–2, ప్రిపరేటరీ, 1వ తరగతి, 2వ తరగతి ఫౌండేషనల్‌ స్కూళ్లు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో, దీనికి ఆనుకుని ఉన్న అంగన్‌వాడీ కేంద్రం విలీనం. తద్వారా ఫౌండేషనల్‌ స్కూళ్లకు అంకురార్పణ. 

2). ఫౌండేషనల్‌ స్కూళ్ల పరిధిలోకి వాటికి సమీపంలోని పీపీ–1, పీపీ–2లుగా మారుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు. ఆ పీపీ–1, పీపీ–2లకు సంబంధించిన పాఠ్యాంశాలు, సమగ్ర బోధనా పద్ధతులతో పాటు, వాటిలో నైపుణ్యం స్థాయి పెంపు. ఇంకా వాటిలో మల్టీలెవల్‌ లెర్నింగ్‌పై ఫౌండేషనల్‌ స్కూళ్ల ద్వారా దృష్టి.

3). ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు సమీపంలోని అప్పర్‌ ప్రైమరీ (యూపీ) స్కూళ్లు, హైస్కూళ్లకు బదలాయింపు. ఆ మేరకు యూపీ స్కూళ్లు, హైస్కూళ్లగా మార్పు. అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల నిర్మాణం.

4). ఫౌండేషనల్‌ స్కూళ్ల ఏర్పాటు వల్ల అధ్యాపక స్రవంతిలోకి అంగన్‌వాడీ టీచర్లను తీసుకురావాలని ప్రతిపాదన. వారు సరైన సామర్ధ్యం పొందేలా శిక్షణ కార్యక్రమాలు. ప్రమోషన్ల ద్వారాప్రైమరీ స్కూళ్లలో ఎస్‌జీటీలు (టీచర్లు)గా అవకాశం.

5). అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌కు బదలాయింపు. ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన, ఆరోగ్య పరిశీలన, వ్యాధి నిరోధకత కోసం ఇచ్చే వ్యాక్సిన్లు, రిఫరల్‌ సర్వీసులన్నీ వాటికి బదలాయింపు. 

సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది ఉన్నందు వల్ల వీరికి మంచి సేవలు అందే అవకాశం ఉంటుందన్న సీఎం. 

సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..;

 పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుంది. అందుకే ఈ ఆలోచన. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని నా తపన, ఆరాటం. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే ఈ వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు,  ఫౌండేషనల్‌ స్కూళ్లు.అన్ని వసతులతో విద్యార్థులకు మంచి విద్యాభ్యాసం కోసమే మనబడి నాడు–నేడు చేపట్టాము. ఈ కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నాము.అధికారులు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనల వల్ల కాస్ట్‌ ఇంపార్ట్, ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌పె పరిశీలన చేయండి. ప్రతి మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ పెట్టాలనుకున్నాం.

 ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్‌ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్‌ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీని తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. 

పీపీ స్కూళ్లు–మ్యాపింగ్‌:

–ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషనల్‌ స్కూళ్లు అన్నీ కూడా ఒక కిలోమీటర్‌ దూరం లోపల ఉండాలి. అలాగే అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలి. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలి. టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలి.తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు.

 కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి.. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశం.  ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది.  ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషనల్‌ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు–నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. 

డిజిటల్‌ టీచింగ్‌:

 స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్‌ వాడీలు (పీపీ–1, పీపీ–2), 1, 2 తరగతుల ఫౌండేషనల్‌ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్‌ బోధన ప్రక్రియ (డిజిటల్‌ టీచింగ్‌)పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటిల్‌ బోధనా పద్ధతులు (టీచింగ్‌ మెథడాలజీ) రూపొందించండి.  మనం బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు మారాం. ఇక ముందు డిజిటిల్‌ బోర్డ్స్‌కు వెళ్లే పరిస్థితి వస్తుంది.  డిజిటల్‌ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం పని సామర్థ్యం) ఉండేలా చూసుకోండి.

మనం ఏర్పాటు చేసే పరికరం ఒక రోబస్ట్‌గా ఉండాలి.మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్‌లను గుర్తించండి.ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయండి.ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్‌రూమ్‌లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటినీ సమీక్షించాలి అని ఈ సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేపు చినవీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లాతో పాటు, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad