ఉద్యోగులకు కేంద్రం శుభవార్త! వచ్చే నెల నుంచి వారానికి 3 రోజులు సెలవులు.. పీఎఫ్ పెంపు?

 ఉద్యోగులకు కేంద్రం శుభవార్త! వచ్చే నెల నుంచి వారానికి 3 రోజులు సెలవులు.. పీఎఫ్ పెంపు?

అక్టోబర్ నుంచి కొత్త వేజ్ కోడ్

అమలులోకి వస్తుందా?

ఉద్యోగులకు ఊరట

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోందా? కొత్త కార్మిక చట్టాలను వచ్చే నెల నుంచి అమలులోకి తీసుకువస్తోందా? కొత్త వేజ్ కోడ్ అక్టోబర్ నుంచి వర్తిస్తుందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.

కొత్త వేజ్ కోడ్ అమలులోకి వస్తే.. సెలవులు, వేతనం, పని వేళలు, పీఎఫ్ వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త వేజ్ కోడ్ ప్రకారం చూస్తే.. ఉద్యోగుల పని వేళలు 9 గంటల నుంచి 12 గంటలకు పెరుగుతాయి. కానీ వారానికి 3 రోజులు సెలవులు లభిస్తాయి. కార్మిక శాఖ ప్రకారం వారానికి 48 గంటల రూల్స్ అమలులోకి వస్తాయి.

ఉద్యోగులు 12 గంటలు పని చేస్తే వారానికి 3 రోజులు సెలవు తీసుకోవచ్చు. ఇంకా కొత్త వేజ్‌ కోడ్ వల్ల ఉద్యోగుల టేకోమ్ శాలరీ తగ్గొచ్చు. ఉద్యోగుల బేసిక్ వేతనం పెరుగుతుంది. కంపెనీ సీటీసీలో బేసిక్ శాలరీ 50 శాతం కన్నా తక్కువ ఉండకూడదు. చాలా కంపెనీలు ప్రస్తుతం అలవెన్స్‌లు ఎక్కువ ఇస్తూ బేసిక్ శాలరీ తక్కువ ఇస్తుంటాయి.

అయితే కొత్త రూల్ అమలులోకి వస్తే.. బేసిక్ శాలరీ పెరుగుతుంది. దీంతో పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీని వల్ల ఉద్యోగుల టేకోమ్ శాలరీ తగ్గొచ్చు. ఇంకా కోడ్ అమలులోకి వస్తే ఉచిత మెడికల్ చెకప్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉద్యోగులకు అందనున్నాయి. ఓవర్ డ్యూటీ లెక్కింపు రూల్స్ కూడా మారతాయి. 15 నిమిషాల నుంచి 30 నిమిషాలలోపు పని చేసినా 30 నిమిషాలుగానే పరిగణిస్తారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad