Cyclone Jawad: దూసుకొస్తున్న జొవాద్ తుఫాన్.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

 Cyclone Jawad: దూసుకొస్తున్న జొవాద్ తుఫాన్.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్.

Cyclone Jawad: జొవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 280 కిలోమీటర్లల దూరంలో ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కిలోమీటర్లు, పూరీకి 460 కిలోమీటర్లు, పారాదీప్‌కి 540 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుండగా ఇవాళ ఉదయం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలోకి వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Alert💥  : తుఫాన్ ఇప్పుడు ఎక్కడ ఉందొ లైవ్ చుడండి

తుపాను దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుందని వివరించారు. దీని ప్రభావంవల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు తుపాను కారణంగా 95 రళ్లు రద్దయ్యాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad