FEE GOs SUSPENDED : పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై 53, 54 జీవోలను కొట్టివేత

 ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ జీవోల కొట్టివేత

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ సర్కారు 53, 54 జీవోలను చేసిన విషయం విధితమే. ఈ జీవోలను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు.. మేనేజ్‌మెంట్‌ నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది.

READ: GO 53 , 54 Dt:24.08.21 : స్కూల్‌లు , జూనియర్‌ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53, 54 జీవోలు ఇచ్చింది. అయితే, ఈ జీవోలను సవాల్‌ చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరఫున గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి. ఈ మేరకు హైకోర్టు రెండు జీవోలను కొట్టి వేసింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad