PRC పై ముగిసిన సమీక్ష.. మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల

 PRC పై ముగిసిన సమీక్ష.. మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల రామకృష్ణారెడ్డి

మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చాకే పీఆర్‌సీ ప్రకటన: సజ్జల రామకృష్ణారెడ్డి

 👉ఉద్యోగులు ఎక్కువ ఊహించుకొని తర్వాత నిరుత్సాహపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిది’’ 

అమరావతి: పీఆర్‌సీ అంశాలపై అధికారుల కమిటీతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సహా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు రావత్, శశిభూషణ్ కుమార్, సత్యనారాయణలు సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు పీఆర్‌సీపై సమావేశంలో చర్చించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను వారు వివరించారు.

సీఎంతో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సెంట్రల్ పీఆర్‌సీ కమిషన్‌ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు కొంత మేర తగ్గుతున్నాయని గుర్తించాం. మధ్యంతర భృతి 27 శాతం కంటే తగ్గకుండా కొంత మేర పెరిగేట్టు మళ్లీ కసరత్తు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. రేపు, ఎల్లుండి అధికారులు ఈ విషయంపై కసరత్తు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆయా అంశాలను సీఎంకు వివరిస్తారు. ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. ఆ తర్వాతే పీఆర్‌సీ ప్రకటన ఉంటుంది. తెలంగాణలో ఐఆర్ ఇవ్వలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పీఆర్‌సీ ప్రకటించింది. కొవిడ్ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకునే కొత్త పీఆర్‌సీ ప్రకటన ఉంటుంది. ఈ విషయాన్ని ఉద్యోగులు ఆర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగులు ఎక్కువ ఊహించుకొని తర్వాత నిరుత్సాహపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిది’’ అని సజ్జల పేర్కొన్నారు.

------------

సాక్షి, తాడేపల్లి: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్గత సమీక్ష ముగిసింది. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాలపై కూడా సమీక్షలో చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 

అనంతరం సజ్జల రామాకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ ముఖ్యమంత్రితో ఉద్యోగుల ఫిట్ మెంట్ పై మరో మారు సుదీర్ఘంగా చర్చించాము.  ఐఆర్ కంటే తగ్గకుండా ఉద్యోగులు నష్టపోకుండా ఫిట్ మెంట్ ఉండేలా చూడమని సీఎం చెప్పారు. తెలంగాణాలో ఐఆర్ ఇవ్వకుండా ఫిట్ మెంట్ 30 శాతం ఇచ్చారు. మన దగ్గర ముందస్తుగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాము. అయినా ఉద్యోగులు 14.29 శాతం ఫిట్ మెంటుతో నష్టపోతున్నాం అంటున్నారు. వాళ్ళకి నష్టం జరగకుండా ప్రతిపాదనలతో రావాలని సీఎం చెప్పారు. దీనివల్ల ఫిట్ మెంట్ విషయం క్రిస్టమస్ తర్వాత నిర్ణయం అయ్యే అవకాశం ఉంది’’ అని తెలిపారు. 

‘‘ఈ లోపు అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తారు. ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు.ఈ నాలుగైదు రోజుల్లో ఆర్థికేతర అంశాలను అధికారులు పరిష్కరిస్తారు. ఈ నెలాఖరులోపు ఫిట్ మెంట్‌పై నిర్ణయం ఉంటుంది. పీఆర్సీపై ముఖ్యమంత్రితో వివరంగా చర్చించాం. ఈ అంశం త్వరలోనే కొలిక్కి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు వివరించాం’’ అని సజ్జల తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad