APRIL 1 నుంచి ఒంటిపూట బడులు!

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు!

త్వరలో ఉత్తర్వులు 


 ప్రజాశక్తి-

రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 1 ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకునట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేసే అవకాశం. ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిఏటా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరం అకడమిక్ కేలండరులో కూడా ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రస్తావన చేయలేదు. దీంతో ఒంటిపూట బడులు ఎప్పుడు . ప్రారంభమవుతాయో స్పష్టత లేకుండా పోయింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad