PRC పై ఉత్తర్వులు జారీ: IR రికవరీ లేదు.. ఐదేళ్లకే PRC అమలు ఉత్తర్వులను జారీ

PRC పై ఉత్తర్వులు జారీ: IR  రికవరీ లేదు.. ఐదేళ్లకే PRC  అమలు  ఉత్తర్వులను జారీ  



పీఆర్సీ అమలుకు సంబంధించి ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖలు బుధవారం వేర్వేరుగా మొత్తం 8 ఉత్తర్వులను జారీ చేశాయి. వేతన సవరణ సంఘ (పీఆర్సీ), డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఇప్పటివరకు పీఎఫ్‌, జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తుండగా.. దీనికి భిన్నంగా పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే, జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ రికవరీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

G.O.Ms.No. 102 Dated: 11.05.2022 Implementing State PRC instead of central PRC Orders  

G.O.MS.No.94 Dated:09.05.2022 Andhra Pradesh State Employees Group Insurance Scheme 1984

G.O.Ms.No.35 Enhancement of Funeral Charges (Obsequies charges) from Rs.15,000/ Rs.25,000/--Orders

అయితే, 2020 ఏప్రిల్‌ నుంచి 2021 డిసెంబరు వరకు 21 నెలలకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విడిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ బకాయిలను 2023 జనవరి నుంచి నాలుగు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనున్నట్టు వివరించింది. వీరికి జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఐఆర్‌ రికవరీ ఉండదని, జనవరి 2022 పీఆర్సీ వర్తింపజేయనున్నట్టు తెలిపింది.

# PRC 2022 ALL GOs DOWNLOAD

పీఆర్సీని ఐదేళ్లకే అమలు చేయనున్నట్లు ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 17న ఇచ్చిన జీవో నంబరు-1లోని పేరా 15లో ఇచ్చిన సెంట్రల్‌ పే కమిషన్‌కు బదిలీ అంశాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొంది. పీఆర్‌సీ అమలు సమయాన్ని పదేళ్ల నుంచి మళ్లీ ఐదేళ్లకు తగ్గించే జీవో తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక, ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనరు, కుటుంబ పెన్షనరు మరణిస్తే ఇచ్చే మట్టి ఖర్చుల మొత్తాన్ని రూ.25వేలకు పెంచింది. ఇది కూడా ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపింది.

అలాగే, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లోని నాన్-టీచింగ్ స్టాఫ్‌కి 11వ పీఆర్సీ సవరించిన పే స్కేల్స్‌-2022ను వర్తింప చేస్తున్నట్టు ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. 2015 సవరించిన పే స్కేల్స్‌ తీసుకుంటున్న వారందరికీ ఇది వర్తిస్తుంది.

G.O.Ms.No.100  Sanction of Stagnation Increments -Orders

పీఆర్సీలో గరిష్ఠంగా పే స్కేల్‌కు చేరుకున్న ఉద్యోగులకు ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు చెల్లించనున్నారు. పీఆర్సీ సిఫార్సు ప్రకారం ఉద్యోగులకు గ్రేడ్‌ల వారీగా ట్రావెలింగ్ అలవెన్సులను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. గ్రేడ్‌ -1 పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు రాష్ట్రంలో టూర్లకు రూ.600 డెయిలీ అలవెన్సు, బయట రాష్ట్రాల్లో టూర్లకు రూ.800 అలవెన్సు ఇస్తారు. గ్రేడ్‌-2 పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు రాష్ట్రంలో టూర్లకు డెయిలీ అలవెన్సు రూ.400, బయట టూర్లకు రూ.600 అలవెన్సుగా ఇస్తారు. మిగతా ఉద్యోగులను గ్రేడ్‌ -3పరిధిలో ఉంచారు. వీరికి రాష్ట్రంలో డెయిలీ అలవెన్సు రూ.300, బయట రాష్ట్రాల్లో టూర్లకు రూ.400 అలవెన్సుగా నిర్ణయించారు.

వాహన సౌకర్యం అర్హత కలిగిన వారికి కిలోమీటర్ల లెక్కన మైలేజీ అలవెన్సులు, యూనిఫామ్‌ అలవెన్సు, కొన్ని విభాగాలకు రిస్క్‌ తదితర అలవెన్స్‌లను ఇవ్వనున్నారు. ఉద్యోగులను బట్టి ప్రభుత్వం రకారకాల అలవెన్సులను నిర్ణయించి 16 పేజీల జీవో ఇచ్చింది.

కాగా, పీఆర్‌సీ బకాయిలను.. పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని పేర్కొవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పీఆర్‌సీ ఎరియర్స్‌ను ఎప్పుడో 20-25 ఏళ్లకు చెల్లిస్తామనడంపై మండిపడుతున్నారు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో.. దాని విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసని ప్రశ్నిస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad