FACIAL ATTENDANCE : ప్రభుత్వం మొండికేస్తే యాప్ డౌన్

FACIAL ATTENDANCE : ప్రభుత్వం మొండికేస్తే యాప్ డౌన్  

• ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం 

• నేడు మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో ఫ్యాపో భేటీ

• సానుకూల నిర్ణయం రాకపోతే కార్యాచరణపై ప్రకటన

ఈనాడు, అమరావతి: యాప్ ఆధారిత నమోదుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొత్తం యాప్లను డౌన్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ-హాజరు నమోదుపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులను కలవనున్నారు. యాప్ ల భారంతో బోధనకు ఏర్పడుతున్న ఆటంకాలు, ఈ-హాజరు క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను వారికి విన్నవించనున్నారు. వారి నుంచి వచ్చే హామీ మేరకు కార్యాచరణ ప్రకటించనున్నారు. సానుకూల హామీ లభిం చకపోతే అన్ని యాప్లను నిలిపివేయాలని భావిస్తు న్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యాకా నుక, 'నాడు-నేడు' పనుల వివరాలను ఉపాధ్యాయులు యాప్ నమోదు చేస్తున్నారు. తమ సొంత సెల్ఫోన్ల ద్వారానే వాటిని నిర్వహిస్తున్నారు. యాప్ డౌన్ ప్రక టిస్తే ఆ వివరాల సేకరణ నిలిచిపోతుంది. సొంత సెల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకొని, హాజరు నమోదు. చేయబోమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు బుధవారం కూడా ఉపాధ్యాయులు విన తులు సమర్పించారు. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక నమూనా సిద్ధం చేసి పంపాయి. బుధ వారం ఈ-హాజరు నమోదు 50 శాతంలోపే నమోదైంది.చాలామంది ఉపాధ్యాయులు యాప్లను డౌన్లోడ్ చేసు కోలేదు. సిగ్నల్స్, సాంకేతిక సమస్యల కారణంగా కొందరి హాజరు నమోదు కాలేదు.

వ్యక్తిగత భద్రతకు ముప్పు!

ముఖ ఆధారిత యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్ లోని వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు ఏర్పడ వచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. యాప్ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత కాల్స్ మేనేజ్, ఫొటోలు, వీడి యోల మేనేజ్కు అనుమతి ఇవ్వాల్సి వస్తోందని, లోకే షన్ ఆన్ చేస్తేనే హాజరు తీసుకుంటోందని, దీని కార ణంగా తమ వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఏర్పడే అవ కాశం ఉందని పేర్కొంటున్నారు. ఫోన్లోని సమాచారం ఇతరులు తెలుసుకునే వీలుంటుందని ఆందోళన చెందు తున్నారు. కొందరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ ను పక్కనపెట్టి వ్యక్తిగత కాల్స్ కోసం మరో ఫోన్ వాడుతున్నారు. ప్రభుత్వమే డివైజ్లు, డాటా ఇస్తే హాజరు నమోదుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ-హాజరును తాము వ్యతిరేకించడం లేదని చెబుతు న్నారు. సొంత ఫోన్లో యాప్లు వేసుకోవడాన్నే వ్యతి రేకిస్తున్నామని అంటున్నారు.

86 మందికి షోకాజ్ నోటీసులు..

బుధవారం మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 86 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కర్నూలు జిల్లా విద్యాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాప్ పని చేయకపోవడం వల్లనే హాజరు నమోదు చేయలేకపోయామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad