Adenovirus: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న అడెనోవైరస్.. గత 24గంటల్లో ఏడుగురు మృతి..

 Adenovirus: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న అడెనోవైరస్.. గత 24గంటల్లో ఏడుగురు మృతి..

భారత్‌లో మరో వైరస్ అలజడి రేపుతోంది. అడెనో వైరస్.. కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. రెండేళ్లలోపు చిన్నారులను అడెనో వైరస్ బలి తీసుకుంటుండడంతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అదేనో వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారని సీనియర్ ఆరోగ్య అధికారి గురువారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అడెనోవైరస్‌లు అనేది సాధారణంగా జలుబు, కండ్లకలక (కంటిలో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని కొన్నిసార్లు పింక్ ఐ అని పిలుస్తారు), క్రూప్, బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌ల సమూహం. పిల్లలలో, అడెనోవైరస్లు సాధారణంగా శ్వాసకోశ మరియు ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

అయితే, అడెనోవైరస్ కారణంగా గత 24 గంటల్లో ఎన్ని మరణాలు సంభవించాయనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (ARI) సర్వసాధారణమని, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. “ప్రస్తుతం వైరల్ మహమ్మారికి ఎటువంటి ఆధారాలు లేవు” అని రాష్ట్ర ఆరోగ్య అధికారులు చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 మంది పడకలను సిద్ధం చేస్తామని మమత ప్రభుత్వం అందించింది.

“గత 24 గంటల్లో, కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు పిల్లలు, బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఇద్దరు మరణించారు” అని ఓ అధికారి తెలిపారు. అడెనోవైరస్ పరీక్ష లక్షణాలతో ఉన్న వారి నమూనాల కోసం పంపామని.. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్‌ఐ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం. వివిధ వైరస్ల కారణంగా ఏర్పడే ARI అనేది ఒక సాధారణ కాలానుగుణ వైరస్ అని.. ప్రభుత్వం గుర్తించింది. ఏఆర్‌ఐ ఫెక్షన్‌ల సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నదని అధికారులు తెలిపారు. దీని తర్వాత ప్రభుత్వం 24×7 అత్యవసర హెల్ప్‌లైన్ — 1800-313444-222 నంబర్లను ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్‌ఎస్‌ నిగమ్‌ డాక్టర్‌ బిసి రాయ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌ డిగ్రీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ సైన్సెస్‌ని సందర్శించి మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. దీంతోపాటు సిసియు, జనరల్‌ వార్డులో పడకల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిసింది.

0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎక్కువగా సంక్రమణకు గురవుతున్నారని.. ఈ కేసులను ఇంట్లోనే చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. పిల్లలలో, అడెనోవైరస్ సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని గమనించవచ్చు. అయితే, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది....

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad