ODI Format: వన్డేలకు ఇక చెక్. క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్ ఎంట్రీ.. ఎన్ని ఓవర్లు ఉంటాయి?

ODI Format: వన్డేలకు ఇక చెక్. క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్ ఎంట్రీ.. ఎన్ని ఓవర్లు ఉంటాయి?

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్ రాబోతోందా? వన్డే క్రికెట్‌లో మార్పు వస్తుందా? ఇప్పుడు 40 ఓవర్ల పాటు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం.

అయితే భవిష్యత్తులో ఈ మార్పులు వస్తాయనే చర్చలు మొదలయ్యాయి. వన్డే ఫార్మాట్‌ను సజీవంగా ఉంచాలంటే దానిని మార్చాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్‌లో 40 ఓవర్లు ఉండాలని సూచించాడు. శాస్త్రి ప్రకటనను దినేష్ కార్తీక్ కూడా సమర్థించారు.

వన్డే క్రికెట్ శోభను కోల్పోతుందని, ఈ ఏడాది ప్రపంచకప్ చివరిసారిగా 50 ఓవర్లు జరగవచ్చని మాజీలు అభిప్రాయపడ్డారు. ఎందుకు ఇలా అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ODI క్రికెట్‌ని మార్చండి: రవిశాస్త్రి

వన్డే క్రికెట్‌ను కాపాడుకోవాలంటే భవిష్యత్తులో 40-40 ఓవర్లకు తగ్గించాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రి మాట్లాడుతూ, 1983లో ప్రపంచకప్ గెలిచినప్పుడు 60 ఓవర్ల మ్యాచ్‌లు ఉండేవి. ఆ తర్వాత ప్రజల్లో ఆసక్తి తగ్గి 50 ఓవర్లకు కుదించారు. దాన్ని 40 ఓవర్లకు కుదించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. కాలంతో పాటు మార్పు రావాలని అన్నారు.

వన్డే క్రికెట్ బోరింగ్‌గా మారింది: దినేష్ కార్తీక్

రవిశాస్త్రి మాటలతో ఏకీభవించిన దినేష్ కార్తీక్ మరో అడుగు ముందుకేశాడు. క్రికెట్‌లో అత్యుత్తమ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌ను ప్రజలు చూడాలనుకుంటున్నారని చెప్పాడు. ప్రజలు వినోదం కోసం T20 చూస్తారు. కానీ 50 ఓవర్ల ఆట బోరింగ్‌గా మారింది. ప్రజలు 7 గంటలు కూర్చుని చూడాలని కోరుకోరు. అందుకే బహుశా భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ 50 ఓవర్లలో చివరిసారిగా ఆడే అవకాశం ఉందని కార్తీక్ పేర్కొన్నాడు. ఇక రవిశాస్త్రి, దినేష్ కార్తీక్ మాటలు ఎంత వరకు నిజం కాబోతున్నాయో చూడాలి మరి దీనిపై ఐసీసీ ఏమనుకుంటుందో.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad