ఏపీలో పెరుగుతున్న కరోనా ప్రభావం: కొత్తగా మరో 207 కేసులు



ఏపీని కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,775 శాంపిల్స్‌ను పరీక్షించగా 141మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (64), విదేశాల నుంచి (2) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 207 కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 800కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2599మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 80మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఎవరూ చనిపోలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 4402కు (మొత్తం 5636కు) చేరాయి. మరో 59మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1723కు చేరింది. 
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad