PM Narendra Modi to discuss COVID-19 situation with CMs of all states on July 27

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. జులై 27న సోమవారం నాడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై చివరిసారిగా జూన్ 16,17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.



అయితే, కేవలం మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతోనే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న అన్‌లాక్ 2.0పై రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. దేశంలో వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావడం ఇది ఏడోసారి. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించి, వారి అభిప్రాయాలను తీసుకుంటారు. అనంతరం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. జులై నెలలోనే ఇప్పటి వరకూ దాదాపు 8 లక్షల వరకూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా శుక్రవారం తొమ్మిది రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గౌబా మాట్లాడుతూ.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల పెంపు, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిఘా విస్తృతం చేయడం, మహమ్మారి నియంత్రణపై అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన చికిత్స అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ, రోగులను గుర్తించడం, అనంతరం వారిని ఐసొలేషన్‌, క్వారంటైన్‌లో ఉంచడం తదితర అంశాల గురించి కీలక సూచనలు చేశారు.

ముఖ్యమంత్రులతో సమావేశంలో వారి నుంచి పలు అభిప్రాయాలను సేకరించి, కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. అయితే, దాదాపు నెలన్నర తర్వాత సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండటంతో మరోసారి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరస్ ఉద్ధృతంగా ఉన్న తరుణంలో సీఎంలతో ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Aggressive Test  నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.

COVID-19 వ్యాప్తిని అరెస్టు చేసే ప్రయత్నంలో దూకుడు పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ముందు రాష్ట్రాన్ని కోరింది. క్యాబినెట్ కార్యదర్శి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో, కంటైనర్ జోన్లకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మరియు ఆయా అధికార పరిధిలోని అధిక-ప్రమాదం ఉన్న జనాభా యొక్క మ్యాపింగ్ చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య శాఖలను కోరారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad