ప్రాథమిక విద్యలో తొలిసారిగా 'మిర్రర్ ఇమేజ్' పాఠ్య పుస్తకాలు

👉పేజీకి అటూ ఇటూ ఇంగ్లిష్, తెలుగులో ముద్రణ*

👉తెలుగు నుంచి ఇంగ్లిష్ మాధ్యమానికి మార్పుసరళంగా జరిగేందుకు ప్రభుత్వం చర్యలు

👉*సెమిస్టర్ విధానం ప్రాథమిక విద్యలో ఇదే మొదటిసారి

👉*తెలుగు, ఇంగ్లిష్, గణితంలో 1-8వ తరగతి వరకు మార్పులు

👉*ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు తొలిసారిగా వర్క్ బుక్స్*

🔷️అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు పలు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు మాతృభాషతోపాటు అటు ఆంగ్లభాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. 

🔶️ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రక్రియ సరళంగా జరిగేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎలిమెంటరీ స్థాయిలో 'మిర్రర్ ఇమేజ్పా ఠ్య పుస్తకాలు అందించేందుకు సిద్ధమైంది. 

🔷️రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభం కానుంది.

🔶️ఇప్పటికే మనబడి నాడు-నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబసన్ను మార్చింది.*

🔷️విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలను రూపొందించింది. 

🔷️ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్ ఇమేజ్ తరహాలో ఒక పేజీలో తెలుగు, ఎదుటి పేజీలో ఇంగ్లిష్ లో పాఠ్యాంశాలుండేలా రూపొందించారు.*

🔶️రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు-ఇంగ్లిష్ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్ఇ మేజ్ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు.

🔷️ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్, గణితం సిలబస్లో మార్పులు చేశారు.

🔶️ఈవీఎస్ (ఎన్విరాన్ మెంటల్ సైన్స్) ఇకపై 3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్ రూపకల్పన.

🔷️ఆరో తరగతిలో సోషల్, హిందీ పాఠ్యాంశాల్లో మర్పులు చేశారు.

🔶️ఈఏడాది తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు వర్క్ బుక్స్అం దించనున్నారు.

🔷️గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికి పైగా కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చారు.

🔶️రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్వి ద్యా విధానం అమలులోకి తెస్తున్నారు.

 🔶️పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందచేస్తారు. దీనివల్ల పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది.

🔷️రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ పలువురు విద్యారంగ నిపుణులతో చర్చించి 1 నుంచి 6వ

తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేసింది. నూతన పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

🔶️తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి 116 మంది కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చాం.

🔷️సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత ఆలోచనలతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. 

🔶️తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్కబుకు ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్ హ్యాండ్ బుక్ కూడా ఇస్తున్నాం.

 🔷️ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం'*

- *డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ డైక్టర్

☘️🍁☘️🍁☘️🍁☘️🍁

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad