వచ్చే ఏడాది నుంచే 'ప్రీ ఫస్ట్ క్లాస్' అమలు... AP ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒకటో తరగతికి ముందే విద్యార్థుల పునాదిని స్థాపించడానికి ఒక సంవత్సరం పాటు 'ప్రిపరేటరీ క్లాస్'ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ నూతన విద్యావిధానాన్ని ఏపీలో 2021-22 నుండి రాష్ట్రంలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. 5 + 3 + 3 + 4 పాఠశాల వ్యవస్థను కొత్తగా అమలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తగిన విధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంటుంది.

పిపి -1, పిపి -2 అందిస్తున్న అంగన్వాడీలను వైఎస్ఆర్ ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అమలు చేయనున్న ప్రీ ఫస్ట్ క్లాస్ దీని తర్వాత ఉండనుంది. దీని వల్ల పిల్లలు సరదాగా నేర్చుకోగలరు. విద్యార్థి చదువులో రాణించాలంటే పునాది బలంగా ఉండాలి. అందుకోసం ఒకటవ తరగతికి రాకముందే చదువు పట్ట ఆసక్తి, శ్రద్ధ ఉండేలా చూడాలి. జాతీయ నూతన విద్యా విధానంపై చర్చ రాకముందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యావిధానంలో సంస్కరణలను అమలు చేస్తోందని, వీటిలో అంగన్వాడీలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం కూడా ఉందని ఈ నూతన విద్యావిధానంపై విద్యాశాఖ మంద్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం మా దృష్టి ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఉందని ఆయన అన్నారు.

పాఠ్యపుస్తకాల్లో స్థానిక సంస్కృతి, ఆచారాలు, చరిత్రను ఎక్కువగా కవర్ అయ్యేలా రూపొందించాలి. దీని కోసం ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కనీసం 50 గంటల శిక్షణ ఇవ్వడంపై దృష్టి కేంద్రీకరించినట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు. వెనుకబడిన, అణచివేతకు గురైన వారి అవసరాలను తీర్చడానికి ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల పిల్లల కోసం 1,261 రెసిడెన్షియల్ పాఠశాలలు, 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కెజిబివి), వికలాంగుల కోసం 672 ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. నూతన విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ టీచర్ల నైపుణ్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎన్సిఇఆర్టి మార్గదర్శకాల ప్రకారం, ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు, 10 వ తరగతి విద్యార్థులకు ఒక సంవత్సరం డిప్లొమా కోర్సు అర్హతను ప్రవేశపెట్టాలి "అని వారు వివరించారు. విద్యారంగంలో గ్రామ, వార్డ్ సెక్రటేరియట్ల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలి. అందుకు తగిన ఎన్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ను చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

నాణ్యమైన ప్రమాణాల అమలును నిర్ధారించడానికి పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా కేంద్రాలను పరిశీలించాలని, ప్రమాణాలు కొరవడితే చర్యలు తీసుకోవాలని, స్కూళ్లు, కాలేజీలు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వాటిని మూసివేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను అమలు చేసిన తర్వాతే సంస్థలను తిరిగి తెరవడానికి అనుమతించాలని ఆయన అన్నారు 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad