ATM WITHDRAWALS : ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు రూ. 21 స‌ర్వీస్ చార్జ్‌…

 మొద‌లైన బాదుడు… ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు రూ. 21 స‌ర్వీస్ చార్జ్‌…

డిజిట‌ల్ టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఏటీఎం కు వెళ్లి క్యాష్ తెచ్చుకునేవారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ది.  పైగా, ఏటీఎంల‌లో 5 ట్రాన్సాక్ష‌న్ల వ‌ర‌కు ఉచితంగా అందిస్తున్నారు.  5 ట్రాన్సాక్ష‌న్ల త‌రువాత ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు స‌ర్వీస్ చార్జీలు వ‌సూలు చేస్తున్నారు.  కాగా, ఈ స‌ర్వీస్ చార్జీలు మ‌రింత‌గా పెరిగాయి.  ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల మేర‌కు స‌ర్వీస్ చార్జీల‌ను పెంచుతూ బ్యాంకులు నిర్ణ‌యం తీసుకున్నాయి.  గ‌తంతో ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే స‌ర్వీస్ చార్జీ కింద రూ. 20 వ‌సూలు చేసేవారు.  కానీ ఇప్పుడు ఆ చార్జీల‌ను రూ.21 చేసింది.  

Read: S A- l Timetable for 2021-22 - SYLLABUS 

పెంచిన చార్జీలు జనవరి 1 నుంచే అమ‌లులోకి వ‌స్తున్నాయి.  క్యాష్‌, నాన్ క్యాష్ ట్రాన్సాక్ష‌న్ అన్నింటికీ ఇది వ‌ర్తిస్తుంది.  బ్యాంకుల‌కు సంబంధించి ఇత‌ర ప‌న్నులు కాకుండా  ఏటీఎం ట్రాన్సాక్ష‌న్‌కు రూ. 21 వ‌సూలు చేసేందుకు ఆర్బీఐ గ‌త ఏడాది జూన్ 10 వ తేదీన అనుమ‌తులు ఇచ్చింది.  అ అనుమ‌తులు జ‌న‌వ‌రి 1, 2022 నుంచి అమ‌లులోకి వచ్చాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad